బిల్లుల కోసం న్యాయపోరాటం

ABN , First Publish Date - 2021-10-29T04:44:25+05:30 IST

గత ప్రభుత్వ హయాంలో చేసిన పనులకు బిల్లులు రాబట్టుకునేందుకు న్యాయపోరాటం చేస్తామని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి నెలవల సుబ్రహ్మణ్యం తెలిపారు.

బిల్లుల కోసం న్యాయపోరాటం
నియోజకవర్గ సమన్వయకర్తల సమావేశంలో మాట్లాడుతున్న పార్టీ ఇన్‌చార్జి నెలవల

 నియోజకవర్గ ఇన్‌చార్జి నెలవల 

సూళ్లూరుపేట, అక్టోబరు 28 : గత ప్రభుత్వ హయాంలో చేసిన పనులకు బిల్లులు రాబట్టుకునేందుకు న్యాయపోరాటం చేస్తామని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి నెలవల సుబ్రహ్మణ్యం తెలిపారు. స్థానిక సత్యసాయి కల్యాణ మండపంలో గురువారం సాయంత్రం జరిగిన ఆ పార్టీ సమన్వయకర్తల సమావేశంలో ఆయన ప్రసంగించారు. గత ప్రభుత్వంలో నీరు-చెట్టు పనులు చేసి బిల్లులు రానివారి పేర్లు, ఆయా మండలాల పరిధిలోని పార్టీ కన్వీనర్లు వద్ద పేర్లు నమోదు చేసుకోవాలని చెప్పారు. నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో బిల్లులు రానివారి పేర్లను పార్టీ అధిష్ఠానవర్గం దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు తిరుమూరు సుధాకర్‌రెడ్డి, వేనాటి సతీష్‌రెడ్డి, ముప్పాళ్ల విజేత, ఆకుతోట రమేష్‌, 6 మండలాల పార్టీ సమన్వయకర్తలు హాజరయ్యారు.

Updated Date - 2021-10-29T04:44:25+05:30 IST