జూనియర్ లెక్చరర్ల పోస్టుల భర్తీ చేపట్టాలి
ABN , First Publish Date - 2021-04-17T05:21:28+05:30 IST
ఏపీపీఎస్సీ ద్వారా కొత్తగా నియామకం చేపడుతున్న జూనియర్ కళాశాలల అధ్యాపకుల పోస్టులను నియర్ వేకెన్సీల ప్రక్రియలో చేపట్టాలని కాంట్రాక్టు అధ్యాపకుల అసోసియేషన్ అధ్యక్షుడు గొర్ల మాణిక్యం విజ్ఞప్తి చేశారు.
వై.రామవరం, ఏప్రిల్ 16: ఏపీపీఎస్సీ ద్వారా కొత్తగా నియామకం చేపడుతున్న జూనియర్ కళాశాలల అధ్యాపకుల పోస్టులను నియర్ వేకెన్సీల ప్రక్రియలో చేపట్టాలని కాంట్రాక్టు అధ్యాపకుల అసోసియేషన్ అధ్యక్షుడు గొర్ల మాణిక్యం విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ 21 సంవత్సరాలుగా కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్న అధ్యాపకులను ఉద్యోగం నుంచి తొలగించడం అన్యాయమని, అధికారంలోకి రాగానే కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి విస్మరించారన్నారు. కార్యక్రమంలో కాంట్రాక్టు అధ్యాపకులు పల్లేటి చంద్రశేఖర్, గొర్ల పాపారావు, కందా రామకృష్ణదొర, ప్రకాష్బాబు, త్రినేత్రికుమారి పాల్గొన్నారు.