జూలై 31న ‘టీఎన్టీపీఎస్’ విజయోత్సవం
ABN , First Publish Date - 2022-06-29T14:41:26+05:30 IST
‘తమిళనాడు తెలుగు పీపుల్ సొసైటీ (టీఎన్టీపీఎ్స) విజయోత్సవం వచ్చే నెల 31న జరుగనుంది. ఈ మేరకు సమావేశమైన ఆ సంస్థ కార్యనిర్వాహక
చెన్నై, జూన్ 28 (ఆంధ్రజ్యోతి): ‘తమిళనాడు తెలుగు పీపుల్ సొసైటీ (టీఎన్టీపీఎస్) విజయోత్సవం వచ్చే నెల 31న జరుగనుంది. ఈ మేరకు సమావేశమైన ఆ సంస్థ కార్యనిర్వాహక కమిటీ నిర్ణయించినట్లు సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు దేవరకొండ రాజు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. గత నాలుగేళ్లుగా తమిళనాడుతో పాటు ఏపీ, తెలంగాణ, కర్ణాటకలో వున్న తెలుగు ప్రజలకు కూడా అందుబాటులో వుండి కరోనా కష్టకాలంలో కూడా సేవలు, సహాయ సహకారాలు అందించినట్లు తెలిపారు. అదే విధంగా వ్యాపారస్తులు, నిరుద్యోగులకు కూడా ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నామన్నారు. ఈ నేపథ్యంలో సాలిగ్రామంలోని ఎల్వీ ప్రసాద్ ల్యాబ్లో సంస్థ విజయోత్సవ సంబరాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ ఉత్సవాల్లో భాగంగా మహిళలకు ముగ్గుల పోటీలు, పిల్లలకు ఆటల పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు అందజేస్తామని వివరించారు. ఈ సమావేశంలో సంస్థ అధ్యక్షుడు జీవీ చౌదరి, ప్రధాన కార్యదర్శి ఎస్.జనార్ధన్, మహిళా విభాగ అధ్యక్షురాలు లక్ష్మి మోహన్, నగేష్ తదితరులు కూడా పాల్గొన్నారు.