JP Nadda: జేపీ నడ్డాకు మదురైలో ఘన స్వాగతం

ABN , First Publish Date - 2022-09-23T13:50:01+05:30 IST

రెండు రోజుల రాష్ట్ర పర్యటన నిమిత్తం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా(BJP National President JP Nadda) గురువారం ఉదయం మదురై

JP Nadda: జేపీ నడ్డాకు మదురైలో ఘన స్వాగతం

                            - భారీగా తరలివచ్చిన కార్యకర్తలు


చెన్నై, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): రెండు రోజుల రాష్ట్ర పర్యటన నిమిత్తం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా(BJP National President JP Nadda) గురువారం ఉదయం మదురై చేరుకున్నారు. మదురై విమానాశ్రయంలో బీజేపీ రాష్ట్ర నాయకులు, కార్యకర్తలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. గురువారం సాయంత్రం 3.30 గంటలకు ఆయన కారైక్కుడి ఎంఏఎం మహాల్‌లో జరిగిన బీజేపీ రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి నాయకులతో సమావేశమయ్యారు. సాయంత్రం మహిళా మోర్చా సమావేశంలో పాల్గొన్నారు. రాత్రి ఎన్జీవో కాలనీ సమీపంలోని మైదానంలో ఏర్పాటైన పార్టీ బహిరంగ సభలో ఎనిమిదేళ్ల బీజేపీ పాలనలో అమలు చేసిన ప్రజా సంక్షేమ పథకాలను వివరిస్తూ ప్రసంగించారు. ఇదిలా వుండగా శుక్రవారం ఉదయం 7.45 గంటలకు పిళ్లయార్‌పట్టి వినాయకస్వామి(Vinayaka Swamy) ఆలయాన్ని సందర్శించనున్నారు. ఆ తర్వాత కారైక్కుడిలోని ప్రైవేటు హాలులో ఉదయం 11 గంటలకు పార్టీకి చెందిన బీసీ, ఎంబీసీ నాయకులతో సమావేశమవుతారు. ఈ కార్యక్రమాల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై, పార్టీ ప్రముఖులు హెచ్‌ రాజా, చోళన్‌ చిత్‌ పళనిస్వామి తదితర నాయకులు పాల్గొంటారు.

Updated Date - 2022-09-23T13:50:01+05:30 IST