టీడీపీలో జోష్‌

ABN , First Publish Date - 2020-10-20T08:21:18+05:30 IST

తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో జోష్‌ పెరిగింది. పార్టీకి సంబంధించి కీలక పదవుల నియామకంలో జిల్లాలో నలుగురి నేతలకు ప్రాధాన్యం దక్కింది. పార్టీ బలోపేతమే లక్ష్యంగా అధినేత

టీడీపీలో జోష్‌

 కీలక పదవుల్లో నలుగురికి స్థానం

(శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి) 

తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో జోష్‌ పెరిగింది. పార్టీకి సంబంధించి కీలక పదవుల నియామకంలో జిల్లాలో నలుగురి నేతలకు ప్రాధాన్యం దక్కింది. పార్టీ బలోపేతమే లక్ష్యంగా అధినేత చంద్రబాబునాయుడు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా పలువురికి కీలక పదవులు అప్పగించారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా మాజీమంత్రి, టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడును  నియమించారు. ఇప్పటివరకూ రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరించిన కళా వెంకటరావును పొలిట్‌బ్యూరోలోకి తీసుకున్నారు. జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడుకి బాధ్యతలు అప్పగించారు.


రామ్మోహన్‌నాయుడు గతంలోనూ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు. మరోసారి ఆయనకు జాతీయ స్థాయిలో బాధ్యతలు అప్పగించడంపై ‘తెలుగు’ తమ్ముళ్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే మాజీ స్పీకర్‌, సీనియర్‌ నాయకురాలు కావలి ప్రతిభాభారతిని జాతీయ ఉపాధ్యక్షురాలిగా నియమించారు. ఆమె గతంలో పొలిట్‌బ్యూరోలో, ఇతరత్రా కీలక స్థానాల్లోనూ ఉండేవారు. ఈసారి అదేస్థాయిలో ఉన్నతమైన స్థానాన్ని కల్పించారు. జిల్లాకు మొత్తంగా నాలుగు కీలక స్థానాలు లభించడంపై టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

శ్రీకాకుళంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో సోమవారం సంబరాలు చేసుకున్నారు. ప్రత్యేకంగా పార్టీ రాష్ట్ర నూతన అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ముఖచిత్రంతో ఉన్న కేక్‌ను మాజీ ఎమ్యెల్యే గుండ లక్ష్మీదేవి కట్‌ చేసి కార్యకర్తలకు తినిపించారు. పార్టీ కార్యాలయ ప్రాంగణంలో కార్యకర్తలు పెద్దఎత్తున బాణసంచా కాల్చారు. 

 

ఫ ఫొటో: టీడీపీ-3 : కింజరాపు రామ్మోహన్‌నాయుడు 

టీడీపీ-2 : కళా వెంకటరావు

టీడీపీ-1 : ప్రతిభా భారతి


Updated Date - 2020-10-20T08:21:18+05:30 IST