30న పెయింటర్‌ ఉద్యోగాలకు జాబ్‌ మేళా

ABN , First Publish Date - 2021-11-28T04:48:00+05:30 IST

కంచరపాలెం ప్రభుత్వ పాత ఐటీఐలో ఈనెల 30వ తేదీ మంగళవారం ఐటీఐ పెయింటర్‌ ఉద్యోగాలకు జాబ్‌ మేళా నిర్వహించనున్నట్టు ఐటీఐ ప్రిన్సిపాల్‌ జె.శ్రీకాంత్‌ తెలిపారు.

30న పెయింటర్‌ ఉద్యోగాలకు జాబ్‌ మేళా

విశాఖపట్నం, నవంబరు 27: కంచరపాలెం ప్రభుత్వ పాత ఐటీఐలో ఈనెల 30వ తేదీ మంగళవారం ఐటీఐ పెయింటర్‌ ఉద్యోగాలకు జాబ్‌ మేళా నిర్వహించనున్నట్టు ఐటీఐ ప్రిన్సిపాల్‌ జె.శ్రీకాంత్‌ తెలిపారు. ప్రముఖ కంపెనీ ‘జగాహంట్‌ ఈ కామర్స్‌ ఇన్నోవేషన్‌’ ప్రతినిధులు పాల్గొని ఇంటర్వ్యూలు నిర్వహిస్తారని, పెయింటర్‌ ట్రేడ్‌లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు హాజరు కావచ్చునని తెలిపారు.    ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.12 వేల వేతనం, సౌకర్యాలు కల్పిస్తారని, ఔత్సాహికులు ఆ రోజు ఉదయం 10 గంటలకు కంచరపాలెం పాత ఐటీఐకి హాజరు కావాలని సూచించారు.


ఉపాధి కార్యాలయంలో రేపు జాబ్‌ మేళా

కంచరపాలెంలోని జిల్లా ఉపాధి కార్యాలయంలో సోమవారం జాబ్‌ మేళా నిర్వహించనున్నట్లు ఉపాధి అధికారి సిహెచ్‌.సుబ్బిరెడ్డి తెలిపారు. దక్కన్‌ ఫైన్‌ కెమికల్స్‌, పాయకరావుపేట, అరబిందో ఫార్మాసిటీ (పరవాడ) ప్రతినిధులు హాజరై కెమిస్ట్‌, సహాయకుడి ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారని తెలిపారు. ఔత్సాహికులు ఆ రోజు ఉదయం అన్ని ధ్రువపత్రాలతో హాజరు కావాలని సూచించారు. 


Updated Date - 2021-11-28T04:48:00+05:30 IST