జీవో నెంబర్ 58,59 దరఖాస్తుల పరిశీలన
ABN , First Publish Date - 2022-05-28T05:01:46+05:30 IST
ప్రభుత్వ భూముల్లో జీవో నెంబర్ 58, 59 ప్రకారం
చందానగర్, మే27: ప్రభుత్వ భూముల్లో జీవో నెంబర్ 58, 59 ప్రకారం నివాసం ఉంటున్న వారిని గుర్తించి ఇంటి యాజమాన్య హక్కుపత్రాన్ని అందజేస్తామని, అందుకుగాను కట్టుదిట్టంగా సర్వే చేయాలని జిల్లా కలెక్టర్ అమయ్కుమార్ అన్నారు. శేరిలింగంపల్లి గోపినగర్లో ప్రభుత్వ భూముల్లో జీవో నెంబర్ 58, 59ప్రకారం ఇళ్లను అదనపు కలెక్టర్ ప్రదీ్పజైన్తో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వ భూముల్లో నివాసం ఉంటూ దరఖాస్తు చేసుకున్న వారి వివరాలు క్షుణ్ణంగా పరిశీలించి అర్హులకు మాత్రమే పట్టాలు అందిస్తామన్నారు. అందుకుగాను జిల్లా వ్యాప్తంగా 40టీంలను ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో పరిశ్రమలశాఖ అధికారి రాజేశ్వరరెడ్డి, వంశీమోహన్, ఆర్ఐలు, సర్వేయర్లు పాల్గొన్నారు.