వచ్చే వారంలో జియోఫోన్ నెక్స్ట్ ప్రీ-బుకింగ్స్..
ABN , First Publish Date - 2021-08-29T06:44:06+05:30 IST
వచ్చే వారంలో జియోఫోన్ నెక్స్ట్ ప్రీ-బుకింగ్స్..
న్యూఢిల్లీ: తమ వినియోగదారులకు జియో శుభవార్త అందించింది. భారతదేశంలో జియోఫోన్ నెక్స్ట్ ప్రీ-బుకింగ్లు వచ్చే వారం ప్రారంభంకానున్నట్లు తెలుస్తోంది. రాబోయే స్మార్ట్ఫోన్ను రిలయన్స్ జియో మరియు గూగుల్ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. జియో కస్టమర్లకు ఈ ఫోన్ అత్యంత సరసమైన ఎంపికగా భావిస్తున్నారు. జియోఫోన్ నెక్స్ట్ ఫోన్ స్పెసిఫికేషన్లు హెచ్డీ డిస్ప్లేతో పాటు 3జీబీ ర్యామ్ వరకు ఉండవచ్చు. ప్రీ-ఆర్డర్ల కోసం జియో తన రిటైల్ భాగస్వాములతో చర్చలు ప్రారంభించినట్లు చెబుతున్నారు. జూన్లో జరిగిన ఏజీఎంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ సెప్టెంబర్ 10న ఫోన్ అందుబాటులో ఉంటుందని ప్రకటించారు. అయితే జియో ఇంకా ఎలాంటి వివరాలను అందించలేదు. భారతదేశంలో జియోఫోన్ నెక్స్ట్ ధర ఇంకా అధికారికంగా వెల్లడి కాలేదు. ఇది భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా అత్యంత సరసమైన స్మార్ట్ఫోన్" అని జియో పేర్కొంది. ఓ నివేదిక ప్రకారం జియోఫోన్ నెక్స్ట్ స్మార్ట్ఫోన్ ధర రూ. 3,499 ఉండొచ్చని సమాచారం.