పిల్లలకు బోధన పరికరాలు పంపిణీ
ABN , First Publish Date - 2021-07-28T05:39:53+05:30 IST
జాతీయ మేధో వైకల్య వ్యక్తుల సాధికార సంస్థ ఆధ్వర్యంలో సరఫరా అయిన బోధనా పరికరాలను జేసీ ప్రశాంతి జిల్లాలోని విద్యార్థులకు సోమవారం పంపిణీ చేశారు.
గుంటూరు(విద్య), జూలై 27: జాతీయ మేధో వైకల్య వ్యక్తుల సాధికార సంస్థ ఆధ్వర్యంలో సరఫరా అయిన బోధనా పరికరాలను జేసీ ప్రశాంతి జిల్లాలోని విద్యార్థులకు సోమవారం పంపిణీ చేశారు. కలెక్టరేట్లోని జేసీ చాంబర్లో ఈ కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలో దారిద్రపు రేఖకు దిగువన ఉన్న 37 మంది ఎస్సీ, ఎస్టీ పిల్లలకు ఈ పరికరాలు అందజేశామని జేసీ ప్రశాంతి వెల్లడించారు. కార్యక్రమంలో ప్రత్యేక విద్య అసిస్టెంట్ ప్రొఫెసర్ సూరజ్సింగ్, పీవో ఎస్ఎస్ఏ ఎం.వెంకటప్పయ్య, ప్రత్యేక అవసరాల విద్య కోఆర్డినేటర్ కె.నాగేంద్రమ్మ, సహాయ సమన్వయకర్త మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.