పిల్లలకు బోధన పరికరాలు పంపిణీ

ABN , First Publish Date - 2021-07-28T05:39:53+05:30 IST

జాతీయ మేధో వైకల్య వ్యక్తుల సాధికార సంస్థ ఆధ్వర్యంలో సరఫరా అయిన బోధనా పరికరాలను జేసీ ప్రశాంతి జిల్లాలోని విద్యార్థులకు సోమవారం పంపిణీ చేశారు.

పిల్లలకు బోధన పరికరాలు పంపిణీ
పరికరాలు పంపిణీ చేస్తున్న జేసీ పి.ప్రశాంతి, చిత్రంలో ఎస్‌ఎస్‌ఏ పీవో వెంకటప్పయ్య తదితరులు

గుంటూరు(విద్య), జూలై 27: జాతీయ మేధో వైకల్య వ్యక్తుల సాధికార సంస్థ ఆధ్వర్యంలో  సరఫరా అయిన బోధనా పరికరాలను జేసీ ప్రశాంతి జిల్లాలోని విద్యార్థులకు సోమవారం పంపిణీ చేశారు. కలెక్టరేట్‌లోని జేసీ చాంబర్‌లో ఈ కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలో దారిద్రపు రేఖకు దిగువన ఉన్న 37 మంది ఎస్సీ, ఎస్టీ పిల్లలకు ఈ పరికరాలు అందజేశామని జేసీ ప్రశాంతి వెల్లడించారు. కార్యక్రమంలో ప్రత్యేక విద్య అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ సూరజ్‌సింగ్‌, పీవో ఎస్‌ఎస్‌ఏ ఎం.వెంకటప్పయ్య, ప్రత్యేక అవసరాల విద్య కోఆర్డినేటర్‌ కె.నాగేంద్రమ్మ, సహాయ సమన్వయకర్త మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-07-28T05:39:53+05:30 IST