సుబ్రహ్మణ్యేశ్వరస్వామి సేవలో జేసీ మాధవీలత

ABN , First Publish Date - 2021-01-14T06:48:30+05:30 IST

మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని జాయింట్‌ కలెక్టర్‌ డాక్టర్‌ మాధవీలత కుటుంబసమేతంగా దర్శించుకున్నారు.

సుబ్రహ్మణ్యేశ్వరస్వామి సేవలో జేసీ మాధవీలత

మోపిదేవి : మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని జాయింట్‌ కలెక్టర్‌ డాక్టర్‌ మాధవీలత కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. నాగపుట్టలో పాలుపోసి స్వామివారిని దర్శించుకుని జేసీ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. ప్రధాన అర్చకులు బుద్ధు పవన్‌కుమార శర్మ ఆధ్వర్యంలో అర్చక బృందం వేదమంత్రాలతో ఆశీర్వచనం పలికి శేషవస్త్రాలతో సత్కరించారు. ఈవో జి.వి.డిఎన్‌.లీలాకుమార్‌ స్వామివారి చిత్రపటం, ప్రసాదాలను జేసీ దంపతులకు అందజేశారు. తహసీల్దార్‌ కె.మస్తాన్‌, వీఆర్వోలు మూర్తి, శ్రీనివాస్‌, నీలికాంత్‌ ఉన్నారు. 

Updated Date - 2021-01-14T06:48:30+05:30 IST