దేశ సార్వభౌమత్వాన్ని సవాల్ చేయాలనుకున్న వారికి దీటైన జవాబిచ్చింది సైన్యం : మోదీ

ABN , First Publish Date - 2020-08-15T16:49:39+05:30 IST

దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బ తీయాలనుకునే వారికి దేశ సైనికులు దీటైన జవాబిచ్చారని

దేశ సార్వభౌమత్వాన్ని సవాల్ చేయాలనుకున్న వారికి దీటైన జవాబిచ్చింది సైన్యం : మోదీ

న్యూఢిల్లీ : దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బ తీయాలనుకునే వారికి దేశ సైనికులు దీటైన జవాబిచ్చారని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. 74వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎర్రకోట మీదుగా ఆయన జాతినుద్దేశించి ప్రసంగించారు.


‘‘నియంత్రణ రేఖ మొదలు వాస్తవాధీన రేఖ వరకూ మన దేశ సార్వభౌమత్వాన్ని సవాల్ చేసిన వారికి వారి భాషలోనే మన సైనికులు సరైన జవాబిచ్చారు. వారికి ఏ భాషైతే అర్థమవుతుందో అదే భాషలో జవాబిచ్చారు. ఉగ్రవాదం, విస్తరణవాదానికి సహాయపడే శక్తులను, వాటిని బలపరిచే శక్తులను ఓడించడానికి భారత్ సదా సిద్ధంగానే ఉంటుంది’’ అని ఆయన స్పష్టం చేశారు. లడఖ్‌లో చైనా అతిక్రమణతో పాటు మన దేశ సైనిలిచ్చిన జవాబును ప్రపంచం మొత్తం చూసిందని మోదీ పేర్కొన్నారు. 

Updated Date - 2020-08-15T16:49:39+05:30 IST