చినమామిడిపల్లిలో అండర్ గ్రౌండ్ మార్గం నిర్మించాలి
ABN , First Publish Date - 2022-05-20T05:47:12+05:30 IST
చినమామిడిపల్లిలో రై ల్వేగేట్ తొలగించి గోడ కట్టిన ప్రదేశంలో అండర్ గ్రౌండ్ రోడ్డు మార్గం ఏర్పాటు చేయాలని ఎంపీ రఘురామకృష్ణంరాజుకు జనసేన నాయకులు విన్నవించారు.
నరసాపురం, మే 19: చినమామిడిపల్లిలో రైల్వేగేట్ తొలగించి గోడ కట్టిన ప్రదేశంలో అండర్ గ్రౌండ్ రోడ్డు మార్గం ఏర్పాటు చేయాలని ఎంపీ రఘురామకృష్ణంరాజుకు జనసేన నాయకులు విన్నవించారు. రైల్వేగేట్ తొలగిం చి గోడ కట్టడం వల్ల ప్రజల ఇబ్బందులను ఢిల్లీలో ఎంపీని కలిసి వివరించారు. నరసాపురం నుంచి రాత్రి పూట విశాఖకు నేరుగా ఎక్స్ప్రెక్స్ను నడిపేవిధంగా రైల్వేమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని విన్నవించారు. గతంలో విశాఖకు ఉదయం పూట సింహాద్రి, రాత్రి సమయాల్లో పాస్ట్ ప్యాసింజర్లు ఉండేవన్నారు. వీటినితొలగించడం వల్ల విశాఖ వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎంపీకీ వివ రించారు. దీనిపై ఎంపీ సానుకూలంగా స్పందించి రైల్వేమంత్రి దృష్టికి తీసుకెళ తానని హామీ ఇచ్చినట్లు జనసేన కన్వీనర్ బొమ్మిడి నాయకర్ చెప్పారు. ఢిల్లీ వెళ్లిన వారిలో తోట శ్రీధర్, అకన చంద్రశేఖర్, బందెల రవీంద్ర, యడ్లపల్లి మహేష్, పి భుజంగరావు తదితరులు ఉన్నారు.