సైన్సపై జిజ్ఞాస పెంపొందించడానికి సంబరాలు

ABN , First Publish Date - 2021-10-29T05:18:16+05:30 IST

జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో విద్యార్థుల్లో సైన్సపై జిజ్ఞాస పెంపొందించడానికి చెకుముకి సైన్స సంబరాలు నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్సీ లక్ష్మణరావు తెలిపారు.

సైన్సపై జిజ్ఞాస పెంపొందించడానికి సంబరాలు
పోస్టర్స్‌ ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్సీ లక్ష్మణరావు

గుంటూరు(విద్య), అక్టోబరు 28: జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో విద్యార్థుల్లో సైన్సపై జిజ్ఞాస పెంపొందించడానికి చెకుముకి సైన్స సంబరాలు నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్సీ లక్ష్మణరావు తెలిపారు.  చెకుముకి సంబరాల పోస్టర్స్‌ను బ్రాడీపేటలోని యూటీఎఫ్‌ కార్యాలయంలో గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాల స్థాయిలో నవంబరు 11, మండల స్థాయిలో నవంబరు 18న, జిల్లా స్థాయిలో నవంబరు 28న, రాష్ట్ర స్థాయిలో డిసెంబరు 11,12 తేదీల్లో పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో  జనవిజ్ఞాన వేదిక అధ్యక్షులు  ప్రసాద్‌, డాక్టర్‌ సత్యనారాయణప్రసాద్‌, శ్రీకాంత,  శంకర్‌సింగ్‌, రామమోహనరావు, ప్రవీణ్‌, జోజిబాబు తదితరులు పాల్గొన్నారు.

 

Updated Date - 2021-10-29T05:18:16+05:30 IST