ఉగ్రవాదుల కాల్పుల్లో పోలీసు ఇన్‌స్పెక్టరు మృతి

ABN , First Publish Date - 2020-10-20T12:19:19+05:30 IST

జమ్మూకశ్మీరులోని అనంత్ నాగ్ జిల్లాలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఓ పోలీసు ఇన్‌స్పెక్టరు మృతి చెందారు...

ఉగ్రవాదుల కాల్పుల్లో పోలీసు ఇన్‌స్పెక్టరు మృతి

శ్రీనగర్ (జమ్మూకశ్మీర్): జమ్మూకశ్మీరులోని అనంత్ నాగ్ జిల్లాలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఓ పోలీసు ఇన్‌స్పెక్టరు మృతి చెందారు. అనంత్ నాగ్ ప్రాంతంలో ఉగ్రవాదులున్నారనే సమాచారం మేర జమ్మూకశ్మీరు పోలీసులు గాలిస్తుండగా ఉగ్రవాదులు  కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో జమ్మూకశ్మీరు విభాగానికి చెందిన పోలీసు ఇన్‌స్పెక్టరు ముహమ్మద్అష్రఫ్ తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన అష్రఫ్ ను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో కన్నుమూశారు. షోపియాన్ జిల్లాలో జరిగిన ఎన్ కౌంటరులో ఓ గుర్తుతెలియని ఉగ్రవాది హతమయ్యారు. షోపియాన్ జిల్లా మెల్ హోరా ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు మరణించి ఉంటారని జమ్మూకశ్మీర్ పోలీసులు అనుమానిస్తున్నారు. 

Updated Date - 2020-10-20T12:19:19+05:30 IST