కరోనా బాధితుల కోసం పడవను అంబులెన్స్గా మార్చిన యువకుడు
ABN , First Publish Date - 2021-05-12T19:22:22+05:30 IST
కశ్మీర్లో మొట్టమొదటి తేలియాడే అంబులెన్స్ సేవలు దాల్ సరస్సులో ప్రారంభమయ్యాయి.
శ్రీనగర్: కశ్మీర్లో మొట్టమొదటి తేలియాడే అంబులెన్స్ సేవలు దాల్ సరస్సులో ప్రారంభమయ్యాయి. శ్రీనగర్కు చెందిన తారీక్ అహ్మద్ అనే వ్యక్తి కరోనా రోగుల కోసం ఫ్లోటింగ్ అంబులెన్స్ సేవలు నిర్వహిస్తున్నారు. కోవిడ్తో బాధపడుతున్నవారిని తరలించేందుకు తారీక్ తన పడవను అంబులెన్స్గా మార్చారు. ఇది జమ్మూ కశ్మీర్లోని దాల్ సరస్సులో సేవలు అందిస్తోంది. కరోనా రోగుల రాకపోకల కోసం అహ్మద్ తన పడవను అంబులెన్స్గా మార్చడంపట్ల స్థానికుల్లో హర్షం వ్యక్తమవుతోంది.