వెండి నాణెంపై జైశ్రీరాం, మోదీ బొమ్మ

ABN , First Publish Date - 2020-08-03T10:01:02+05:30 IST

అయోధ్యలో రామమందిర నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో రాజాం కస్పావీధికి చెందిన స్వర్ణకారుడు జగదీష్‌ వెండి నాణెంపై ఒక పక్క ..

వెండి నాణెంపై జైశ్రీరాం, మోదీ బొమ్మ

 ప్రధానికి పంపనున్న స్వర్ణకారుడు జగదీష్‌



రాజాం, ఆగస్టు 2: అయోధ్యలో రామమందిర నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో రాజాం కస్పావీధికి చెందిన స్వర్ణకారుడు జగదీష్‌ వెండి నాణెంపై ఒక పక్క జైశ్రీరాం, రెండో పక్క ప్రధాని మోదీ చిత్రాన్ని రూపొందించాడు. ఎన్నో ఏళ్ల సుదీర్ఘ కాలం తరువాత హిందువుల పోరాటానికి ప్రతీకగా రామమందిర నిర్మాణం చేపట్టనున్నందున ఈ వెండి నాణేన్ని గంటన్నర సమయంలో చెక్కినట్లు చెప్పాడు. ఈవెండి నాణెం తయారు చేయడానికి 3,500 మిల్లీ గ్రామాల వెండి పట్టిందని, దీని విలువ రూ.200 అన్నారు. దీనిని ప్రధాని నరేంద్ర మోదీకి బహుమతిగా పంపనున్నట్లు చెప్పాడు.

Updated Date - 2020-08-03T10:01:02+05:30 IST