రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై జగ్గారెడ్డి ఆగ్రహం

ABN , First Publish Date - 2022-07-03T01:59:09+05:30 IST

హైదరాబాద్‌: టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డిపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఫైరయ్యారు. హైదరాబాద్‌కు వచ్చిన విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీహెచ్ హనుమంతరావు కలిశారు.

రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై జగ్గారెడ్డి ఆగ్రహం

హైదరాబాద్‌: టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డిపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఫైరయ్యారు. హైదరాబాద్‌కు వచ్చిన విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీహెచ్ హనుమంతరావు కలిశారు. ఈ వ్యవహారంపై రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మన ఇంటికి వచ్చినపుడు కలవాలి కాని, కేసీఆర్ ఇంటికి వచ్చిన వాళ్లను మనం వెళ్లి కలవడమేంటని వీహెచ్‌ను పరోక్షంగా ప్రశ్నించారు. రేవంత్ వ్యాఖ్యలపై జగ్గారెడ్డి  స్పందించారు. 

రేవంత్‌ వ్యవహారంపై హైకమాండ్‌కు లేఖ రాస్తా. 

‘‘వీహెచ్ ఎవరో తెలియదని రేవంత్ అనడం సరికాదు. బండకేసి కొడతా అనడానికి రేవంత్‌రెడ్డి ఎవరు?. బండకేసి కొట్టడానికి మేమేమైనా నీ పాలేరులమా? వీహెచ్‌ వయసు ఎక్కడ.. రేవంత్‌ వయసు ఎక్కడా? నువ్వు పోరగాడివి..ఎవరిని బండకేసి కొడతావు? కాంగ్రెస్‌ను రేవంత్‌ ఏమైనా కొనుక్కున్నారా? రేవంత్‌రెడ్డి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి. రేవంత్‌ వ్యవహారంపై హైకమాండ్‌కు లేఖ రాస్తా. టెంప్ట్ అయ్యేవాడు పీసీసీ అధ్యక్ష పదవికి అనర్హుడు. రేవంత్‌ ఉన్నా లేకపోయినా పార్టీని ఎలా కాపాడుకోవాలో తెలుసు. రేవంత్‌ లేకపోయినా పార్టీని నడిపిస్తాం’’ అని జగ్గారెడ్డి పేర్కొన్నారు. 

Updated Date - 2022-07-03T01:59:09+05:30 IST