వైసీపీ అక్రమాలపై విచారణ జరిపించాలి
ABN , First Publish Date - 2021-02-25T05:30:00+05:30 IST
భానుగుడి (కాకినాడ), ఫిబ్రవరి 25: పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ నేతలు పాల్పడిన అక్రమాలు, అధికార దుర్వినియోగంపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్, జిల్లా ఎన్నికల అధికారి విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని టీడీపీ రాష్ట్ర నేత, జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ డిమాండ్ చేశారు.
జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ
భానుగుడి (కాకినాడ), ఫిబ్రవరి 25: పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ నేతలు పాల్పడిన అక్రమాలు, అధికార దుర్వినియోగంపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్, జిల్లా ఎన్నికల అధికారి విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని టీడీపీ రాష్ట్ర నేత, జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ డిమాండ్ చేశారు. టీడీపీ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ను టీడీపీ నాయకులు గురువారం కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నెహ్రూ మీడియాతో మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల్లో జరిగిన అక్రమాలు మున్సిపల్ ఎన్నికల్లో జరగకుండా ఉండేలా పోలింగ్, కౌంటింగ్ కేంద్రాల వద్ద వెబ్కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో కాకినాడ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎ్సఎన్ వర్మ, కాకినాడ పార్లమెంట్ తెలుగు మహిళాధ్యక్షురాలు సుంకర పావని పాల్గొన్నారు.