జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా సేవలు
ABN , First Publish Date - 2022-05-24T03:26:51+05:30 IST
ప్రజలకు అందించే సేవలు జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని నేషనల్ క్వాలిటీ అస్సూరెన్స్ టీం సభ్యులు తమన్నశర్మ, అభిషే
వలేటివారిపాలెం, మే 23 : ప్రజలకు అందించే సేవలు జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని నేషనల్ క్వాలిటీ అస్సూరెన్స్ టీం సభ్యులు తమన్నశర్మ, అభిషేక్ గోసావిలు తెలిపారు. వలేటివారిపాలెం పీహెచ్సీని సోమవారం కేంద్ర ప్రభుత్వ టీం సభ్యులు పరిశీలించారు. ఈ సందదర్భంగా పీహెచ్సీలో విధి నిర్వహణ, సిబ్బంది పనితీరు, డాక్టర్ల హాజరు, ముందుల కొనుగోలు, వినియోగం, ఫీల్డ్విజిట్ తదితర అంశాలను పరిశీలించారు. డాక్టర్లకు, వైద్య సిబ్బందికి సాంకేతిక సలహాలు అందిం చారు. ఔట్ పేషెంట్, ఇన్ పేషెంట్, ఓపీ రికార్డులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు శ్రీనివాసులు, సుమన్, మహలక్ష్మి, కృష్ణప్రసాద్, వాసు తదితరులు పాల్గొన్నారు.