ఐసీఎస్‌ఐ జాతీయ అవార్డును అందుకున్న ఐటీసీ లిమిటెడ్‌

ABN , First Publish Date - 2021-01-16T02:54:20+05:30 IST

ఐసీఎస్‌ఐ జాతీయ అవార్డును అందుకున్న ఐటీసీ లిమిటెడ్‌

ఐసీఎస్‌ఐ జాతీయ అవార్డును అందుకున్న ఐటీసీ లిమిటెడ్‌

న్యూఢిల్లీ: కార్పొరేట్‌ పాలనలో ఐసీఎస్‌ఐ జాతీయ అవార్డును అందుకున్నట్లు ఐటీసీ లిమిటెడ్‌ పేర్కొంది. స్థిరమైన వృద్ధి, పనితీరు, సహాయక సామర్ధ్యాలు, పరిపాలన విలువలు, సీఎస్‌ఆర్‌ దిశగా సున్నితమైన విధానాలు మరియు స్థిరమైన వృద్ధికి గుర్తింపుగా ‘బెస్ట్‌ గవర్నెడ్‌ కంపెనీ’గా ఐటీసీ లిమిటెడ్‌ను ఐసీఎస్‌ఐ గుర్తించింది. ఈ అవార్డు కోసం గౌరవనీయ న్యాయమూర్తి శ్రీ ఏ కె సిక్రీ, పూర్వ న్యాయమూర్తి, భారత సుప్రంకోర్టు మరియు ఇంటర్నేషనల్‌ జడ్జ్‌, సింగపూర్‌ ఇంటర్నేషనల్‌ కమర్షియల్‌ కోర్ట్‌ నేతృత్వంలోని న్యాయనిర్ణేతల బృందం ఐటీసీని గుర్తించింది. ఐటీసీ కంపెనీ సెక్రటరీ రాజేంద్ర కుమార్‌ సింఘిని ‘గవర్నెన్స్‌ ప్రొఫెషనల్‌ ఆఫ్‌ ద ఇయర్‌’గా సైతం ఎంపిక చేశారు. ప్రభావవంతమైన పరిపాలనా ప్రక్రియలను స్వీకరించేదిశగా ఆయన అందించిన తోడ్పాటుకు ఈ అవార్డును అందజేశారు.

Updated Date - 2021-01-16T02:54:20+05:30 IST