అక్రిడిటేషన్ కార్డుల జారీకి దరఖాస్తుల ఆహ్వానం
ABN , First Publish Date - 2022-05-25T05:29:00+05:30 IST
అక్రిడిటేషన్ కార్డుల జారీకి దరఖాస్తుల ఆహ్వానం
వికారాబాద్/మేడ్చల్, మే 24(ఆంధ్రజ్యోతి ప్రతినిధి), మే 24 : 2022-2024 సంవత్సరానికిగాను అక్రిడిటేషన్ల జారీకి పాత్రికేయుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించడం జరుగుతుందని వికారాబాద్ కలెక్టర్ నిఖిల, మేడ్చల్ ఇన్చార్జి కలెక్టర్ హరీష్ ఒక ప్రకటనలో వేర్వేరుగా తెలిపారు. 2019 సంవత్సరంలో జారీచేసిన అక్రిడిటేషన్ కార్డుల జారీకి అర్హులైన జర్నలిస్టుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వారు తెలిపారు. జిల్లాలోని జర్నలిస్టులు సమాచార పౌర సంబంధాలశాఖ ఆన్లైన్ వెబ్సైట్ జ్ట్టిఞ;// జీఞట.్ట్ఛజ్చూుఽజ్చుఽ్చ.జౌఠి.జీుఽ ను సందర్శించి పూర్తి వివరాలను నమోదు చేసుకోవాలన్నారు. ఆన్లైన్ అప్లికేషన్ ఫారంలో అడిగిన ఫొటోలు, డాక్యుమెంట్లను నిర్ణీత సైజులో అప్లోడ్ చేయాలన్నారు. జిల్లాలోని అర్హులైన ప్రింట్, ఎలక్ర్టానిక్ మీడియా జర్నలిస్టులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. జిల్లా రిపోర్టర్కు డిగ్రీ ఉత్తీర్ణత, అసెంబ్లీ నియోజకవర్గ రిపోర్టర్కు ఇంటర్మీడియట్, మండల స్థాయి రిపోర్టర్కు 10వ తరగతి ఉత్తీర్ణత కలిగి ఉండాలన్నారు. లేదా వరుసగా 5 సంవత్సరాల అక్రిడిటేషన్ కార్డు పొందిన అనుభవం ఉన్న వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. యాజమాన్యం వారు జారీచేసిన జాబితాను ఖచ్చితంగా ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని తెలిపారు. అదే విధంగా యాజమాన్యం వారు జారీచేసిన ఒరిజినల్ జాబితాను జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయంలో ముందస్తుగానే అందజేయాలని వారు తెలిపారు. కాగా, ఆన్లైన్ ద్వారా జూన్ 4వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని వారు సూచించారు.