ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
ABN , First Publish Date - 2021-06-18T04:22:40+05:30 IST
ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
ఇబ్రహీంపట్నం: మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకుల కళాశాలల్లో 2021-22 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్లో ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు బీసీ గురుకులాల రీజినల్ కోఆర్డినేటర్ యాదయ్యగౌడ్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 17 బీసీ గురుకుల పాఠశాలలను కళాశాలలుగా అప్గ్రేడ్ చేసినట్లు ఆయన తెలిపారు. బాలికలకు సంబంధించి ఘట్కేసర్, కుత్బుల్లాపూర్, ఉప్పల్, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, రాజేంద్రనగర్, పరిగి, బొంరాస్పేట్ మండలం బురంపూర్, బాలురకు సంబంధించి మల్కాజ్గిరి, కూకట్పల్లి, ఎల్బీనగర్, మియాపూర్, నవాబ్పేట్, తలకొండపల్లిలలో ఈ కళాశాలలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. పదో తరగతి పూర్తి చేసిన వారికి కళాశాలల్లో సీట్లు పొందే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీతో పాటు కొత్తగా హోం సైన్స్, ఆఫీస్ అసిస్టెంట్షిప్, అకౌంట్స్ అండ్ టాక్సేషన్, కంప్యూటర్ గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్, ఫిజియోథెరఫీ వంటి వృత్తి విద్యా కోర్సులనుకూడా ప్రవేశ పెట్టినుట్లు ఆయన చెప్పారు. దరఖాస్తు చేసుకోవడానికి ఈనెల 21 వరకు అవకాశం ఉందని ఆయన వివరించారు. నిర్దేశించిన ప్రొఫార్మాలో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు.