కాంట్రాక్టు లెక్చరర్ల రెన్యువల్కు దరఖాస్తుల ఆహ్వానం
ABN , First Publish Date - 2020-10-02T08:54:23+05:30 IST
జోన్-1, జోన్-2 పరిధిల్లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్న అధ్యాపకులను 2020-21 విద్యా సంవత్సరానికి ..
రాజమహేంద్రవరం అర్బన్, అక్టోబరు 1: జోన్-1, జోన్-2 పరిధిల్లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్న అధ్యాపకులను 2020-21 విద్యా సంవత్సరానికి రెన్యువల్ చేయడానికి దరఖాస్తులు కోరుతున్నట్టు ప్రాంతీయవిద్య సంయుక్త సంచాలకుడు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జోన్-1లో 146, జోన్-2లో 161 పోస్టుల రెన్యువల్ జరుగుతుందన్నారు.
2019-20 విద్యా సంవత్సరంలో ఈ ఏడాది మార్చి 31 నాటి కి కాంట్రాక్టు అధ్యాపకులుగా పనిచేసిన వారు మాత్రమే ఇందుకు అర్హుల న్నారు. ఈ నెల 3న ఆయా ఐడీ కళాశాలల ప్రిన్సిపాల్స్ పత్రికా ప్రకటన జారీ చేయాల్సి ఉంటుంది. ఆసక్తి కలిగి ప్రస్తుత విద్యా సంవత్సరంలో పనిచేయాలనుకునేవారు ఈ నెల 5వ తేదీ సాయంత్రం ఐదు గంటల్లోగా దరఖాస్తు చేసుకోవాలి. 7వ తేదీన జిల్లా ఎంపిక కమిటీ సమక్షంలో కౌన్సెలింగ్ జరుగుతుంది. రెన్యువల్ అయిన అధ్యాపకులు 8వ తేదీన అగ్రిమెంట్ చేసుకోవాల్సి ఉంటుందని ప్రాంతీయ విద్య సంయుక్త సంచాలకుడు తెలిపారు.