మైనార్టీ వసతి గృహంలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

ABN , First Publish Date - 2021-08-19T17:01:17+05:30 IST

పోస్ట్‌ మెట్రిక్‌ మైనార్టీ సంక్షేమ వసతి గృహంలో..

మైనార్టీ వసతి గృహంలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

విజయవాడ సిటీ: పోస్ట్‌ మెట్రిక్‌ మైనార్టీ సంక్షేమ వసతి గృహంలో ప్రవేశానికి  జిల్లా మైనార్టీల సంక్షేమశాఖ దరఖాస్తులు ఆహ్వానించింది. ఈ మేరకు శాఖ అధికారి ఎండీ రియజ్‌ సుల్తానా బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. భవానీపురంలోని బాలుర వసతి గృహంలో ప్రవేశానికి ఇంటర్మీడియెట్‌ ఆపై చదువులు చదువుకునే విద్యార్థులు అర్హులన్నారు. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ. లక్ష లోపు ఉండాలన్నారు. వారికి భోజనంతో పాటు వసతి కల్పించనున్నట్లు తెలిపారు. అప్లికేషన్లు మైనార్టీ అధికారి కార్యాలయం నుంచి పొందవచ్చన్నారు. ఈ హాస్టల్‌లో 40 సీట్లు మాత్రమే ఖాళీగా ఉన్నాయన్నారు. వివరాలకు  98495 88941 నంబర్‌ను సంప్రదించాలన్నారు.



Updated Date - 2021-08-19T17:01:17+05:30 IST