కాశీ ఆలయంలో దర్శనాలకు అంతరాయం

ABN , First Publish Date - 2021-11-26T01:44:22+05:30 IST

ప్రఖ్యాత కాశీ విశ్వనాథ ఆలయంలో మూడు రోజుల పాటు

కాశీ ఆలయంలో దర్శనాలకు అంతరాయం

కాశీ: ప్రఖ్యాత కాశీ విశ్వనాథ ఆలయంలో మూడు రోజుల పాటు దర్శనాలకు అంతరాయం కలుగనుంది. నవంబర్ 29నుంచి డిపెంబర్ 1 వరకు తాత్కాలికంగా దర్శనాలు నిలిపివేస్తున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు. ఆలయ పునరుద్ధరణ, సుందరీకరణలో భాగంగా గర్భగుడిలో పనులు చేస్తున్నారు. కాశీ విశ్వనాథ ఆలయంలో గ్రౌండింగ్, పాలీషింగ్ పనులను వర్కర్లు చేయనున్నారు. ఈ నేపథ్యంలో నవంబర్ 29, 30 తేదీలలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు దర్శనాలను నిలిపి వేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. అలాగే డిసెంబర్ 1న తెల్లవారుజాము నుంచి 2వ తేదీ వరకు ఉదయం 6 గంటల వరకు దర్శనాలను నిలిపి వేస్తున్నారు. 



Updated Date - 2021-11-26T01:44:22+05:30 IST