పీయూలో అంతర్గత బదిలీలు
ABN , First Publish Date - 2021-07-24T04:55:21+05:30 IST
పాలమూరు యూనివర్సిటీలో అధికారులకు అంతర్గతబదిలీలు జరిగాయి. ఈమేరకు వైస్చాన్స్లర్ లక్ష్మీకాంత్రాథోడ్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
పాలమూరు యూనివర్సిటీ, జూలై 23: పాలమూరు యూనివర్సిటీలో అధికారులకు అంతర్గతబదిలీలు జరిగాయి. ఈమేరకు వైస్చాన్స్లర్ లక్ష్మీకాంత్రాథోడ్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్గా డాక్టర్ ప్రవీణ్ నియమితులయ్యారు. ఇప్పటివరకు ఈబాధ్యతలు నిర్వర్తించిన డాక్టర్ అనూరాధారెడ్డిని కామర్స్ డిపార్ట్మెంట్ విభాగాధిపతిగా నియమించారు. బాటనీ విభాగాధిపతిగా డాక్టర్ కె.బృందా దేవిని నియమించారు. కంప్యూటర్ సైన్స్ విభాగాధిపతిగా ఎండీ గౌస్ నిజామోద్దీన్, బిజినెస్ మేనేజ్మెంట్ విభాగాధిపతిగా డాక్టర్ ఎస్.ఎన్.అర్జున్కుమార్, కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ విభాగాధిపతిగా జీ.ఆంజనేయులు, అర్థశాస్త్ర విభాగాధిపతిగా డాక్టర్ బీవెంకటరాఘవేందర్, మ్యాథమెటిక్స్ డిపార్ట్మెంట్ హెడ్గా డాక్టర్ బి.నాగరాజు, సోషల్వర్క్ విభాగాధిపతిగా గాలెన్న, జువాలజీ విభాగాధిపతిగా డాక్టర్ గురుస్వామి నియమితులయ్యారు. నూతనంగా బాధ్యతలు తీసుకున్న విభాగాధిపతులంతా తమ డిపార్ట్మెంట్స్లలో చక్కటి ఉన్నతి సాధించేందుకు కృషి చేయాలని వీసీ లక్ష్మీకాంత్ రాథోడ్ సూచించారు.