కుక్కలదాడిలో జింకకు గాయాలు
ABN , First Publish Date - 2020-05-29T11:14:35+05:30 IST
కుక్కల దాడిలో గాయపడిన జింకకు స్థానిక యువకులు వైద్యం అందించి అటవీ అధికారులకు అప్పగించారు
పూతలపట్టు, మే28: కుక్కల దాడిలో గాయపడిన జింకకు స్థానిక యువకులు వైద్యం అందించి అటవీ అధికారులకు అప్పగించారు. మండలంలోని పోలవరం పంచాయతీ చింతమాకులపల్లె గ్రామ సమీపాన గల అటవీప్రాంతం నుంచి ఓ జింక తాగునీటి కోసం వ్యవసాయ బావి వద్దకు వచ్చింది. కుక్కలు దానిపై దాడిచేయ డంతో గాయాలపాలైంది. యువకులు జింకను కాపాడి ప్రథమ చికిత్స అందించి అటవీ అధికారులకు అప్పగించారు.