విద్యుదాఘాతంతో వ్యక్తికి గాయాలు

ABN , First Publish Date - 2022-01-21T06:48:35+05:30 IST

విద్యుదాఘాతంతో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి.

విద్యుదాఘాతంతో వ్యక్తికి గాయాలు

దామరచర్ల, జనవరి 20: విద్యుదాఘాతంతో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ప్రమాదం గురువారం మండలంలోని కొండ్రపోలు గ్రామశివారులో రైల్వేస్టేషన స మీపంలో జరిగింది. గుంటూరు జిల్లా దాచేపల్లి గ్రామానికి చెందిన ఆంజనేయులు రైల్వే విద్యుత కాం ట్రాక్టర్‌ కారు డ్రైవరుగా పనిచేస్తున్నారు. విద్యుత లైన మరమ్మతులు కొనసాగుతుండగా అటుగా వెళ్లిన ఆంజనేయులుకు విద్యుత తీగలు తగిలి విద్యుదాఘాతానికి గురై తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం తెలుసుకున్న 108 సిబ్బంది మిర్యాలగూడకు తరలించారు. పరిస్థితి మిషమించడంతో వైద్యుల సూచన మేరకు హైదరాబాద్‌కు తరలించినట్లు 108 సిబ్బంది శ్రీహరి, జానకిరాములు తెలిపారు. 


Updated Date - 2022-01-21T06:48:35+05:30 IST