వ్యవసాయ బిల్లును రద్దు చేయాలని దీక్ష

ABN , First Publish Date - 2020-10-01T08:41:01+05:30 IST

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లును రదు ్దచేయాలని డిమాండు చేస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో రెండో రోజు బుధవారం నిరసన

వ్యవసాయ బిల్లును రద్దు చేయాలని దీక్ష

 ముమ్మిడివరం, సెప్టెంబరు 30: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లును రదు ్దచేయాలని డిమాండు చేస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో రెండో రోజు బుధవారం నిరసన దీక్షలు చేపట్టారు.  తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట సమైక్యాంధ్ర ఉద్యమ శిబిరంలో సీపీఎం నాయకులు సకిలే సూర్యనారాయణ, సీపీఐ నాయకులు శీలం వెంకటేష్‌ల అధ్యక్షతన రెండోరోజు నిరసన దీక్షలు కొనసాగాయి.


ముఖ్యఅతిథిగా కౌలురైతు సంఘం జిల్లా అధ్యక్షుడు వి.రాజు మాట్లాడారు. బీజేపీ ప్రభు త్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చిననాటి నుంచి ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయడ ం, వ్యవసాయ విద్యుత్‌  బిల్లులను కార్పొరేట్‌ సంస్థలకు అనుకూలంగా తీసుకువచ్చిందన్నారు.


వ్యవసాయ బిల్లులను తక్షణం రద్దు చేయాలని వారు డిమాండు చేశారు. కార్యక్రమంలో జగడం నాగేశ్వరరావు, దొమ్మేటి వీరరాఘవులు, విజయకుమార్‌, మనోహర్‌, వడ్డి నాగేశ్వరరావు, గుబ్బల సాంబమూర్తి, సానబోయిన లక్ష్మణస్వామి, కాశి సత్యనారాయణ, పాలెపు ఈశ్వరరావు, పాటి మీరాసాహెబ్‌, పెచ్చెట్టి వీరరాఘవు  పాల్గొన్నారు. 


Updated Date - 2020-10-01T08:41:01+05:30 IST