పెళ్లయిన రెండేళ్ల తర్వాత ఒంటరిగా పుట్టింటికి.. కన్నీళ్లతో ఆ కూతురు చెప్పింది విని నివ్వెరపోయిన తల్లిదండ్రులు.. చివరకు..
ABN , First Publish Date - 2022-07-02T21:01:38+05:30 IST
ఆ మహిళకు రెండేళ్ల క్రితం వివాహం జరిగింది.. ఎన్నో ఆశలతో మెట్టినింట అడుగుపెట్టింది..
ఆ మహిళకు రెండేళ్ల క్రితం వివాహం జరిగింది.. ఎన్నో ఆశలతో మెట్టినింట అడుగుపెట్టింది.. అయితే హనీమూన్ నాటి నుంచే ఆమెకు కష్టాలు మొదలయ్యాయి.. భర్తలోని శాడిజం బయటపడింది.. అసహజ శృంగారం చేయమని అతను ఆమెను వేధించేవాడు.. బాత్రూమ్లో స్నానం చేస్తుండగా వీడియో తీసి బెదిరింపులకు దిగాడు.. రూ.కోటి కట్నం తీసుకురాకపోతే ఆ వీడియోను వైరల్ చేస్తానని బెదిరించాడు.. భర్త గురించి మామగారికి చెబితే అతను మరింత క్రూరంగా ప్రవర్తించాడు.. కోడలిపై లైంగిక వేధింపులకు పాల్పడాడు.. ఏడాదిన్నర పాటు అత్తింటి వేధింపులు భరించిన ఆ మహిళ ఇటీవల పుట్టింటికి వెళ్లి అక్కడి నుంచి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఇది కూడా చదవండి..
దారుణం.. 90 ఏళ్ల వృద్ధురాలు మృతి.. పూడ్చిపెట్టిన మూడో రోజే మళ్లీ బయటకు తీయించిన గ్రామస్తులు.. కారణమేంటంటే..
మధ్యప్రదేశ్లోని కాన్పూర్లో నివసిస్తున్న భర్త, అతని తల్లిదండ్రులపై ఇండోర్ మహిళ తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. రెండేళ్ల క్రితం వివాహానంతరం హనీమూన్కు కాన్పూర్లోని హోటల్కు తీసుకెళ్లిన భర్త అసహజ శృంగారం చేయమని బలవంతం చేశాడని చెప్పింది. బాత్రూమ్లో కెమెరా పెట్టి తన న్యూడ్ వీడియోలు తీశాడని, రూ. కోటి తీసుకురాకపోతే వీడియోను వైరల్ చేస్తానని బెదిరించాడని చెప్పింది. భర్త చేష్టలను మామగారికి చెప్పడంతో.. అతను కూడా తనపై వేధింపులకు పాల్పడ్డాడని తెలిపింది. అంతా తెలిసినా అత్తగారు తనను మౌనంగా ఉండమని బెదిరిస్తోందని చెప్పింది.
దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆ మహిళ ఇండోర్లోని తన పుట్టింటికి వెళ్లి తల్లిదండ్రులకు తన బాధను వివరించింది. అనంతరం తల్లిదండ్రులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. మహిళ చెప్పింది విన్న పోలీసులు మొత్తం ఐదుగురిపై కేసులు నమోదు చేశారు. త్వరలోనే నిందితులను విచారిస్తామన్నారు.