ఇండోనేషియాలో earthquake...ఏడుగురి మృతి, 85 మందికి గాయాలు

ABN , First Publish Date - 2022-02-26T14:00:37+05:30 IST

ఇండోనేషియా దేశంలో సంభవించిన భారీ భూకంపం వల్ల ఏడుగురు మరణించగా, మరో 85 మంది తీవ్రంగా గాయపడ్డారు...

ఇండోనేషియాలో earthquake...ఏడుగురి మృతి, 85 మందికి గాయాలు

జకార్తా : ఇండోనేషియా దేశంలో సంభవించిన భారీ భూకంపం వల్ల ఏడుగురు మరణించగా, మరో 85 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇండోనేషియా దేశంలోని పశ్చిమ ప్రావిన్సు పరిధిలో ఉన్న పశ్చిమ సుమత్రాలో సంభవించిన భూకంపం ప్రభావం రిక్టర్ స్కేలుపై 6.1గా నమోదైంది. ఈ భూకంపం వల్ల 10,000 భవనాలు, ఇళ్లు దెబ్బతిన్నాయి.ఈ భూకంపం ధాటికి పసమన్ బరాత్ జిల్లాలో ముగ్గురు వ్యక్తులు, పసమాన్ జిల్లాలో మరో నలుగురు మరణించారు.ఈ విపత్తు వల్ల మొత్తం 85 మంది గాయపడ్డారని ఇండోనేషియా అధికారులు చెప్పారు.ఈ భూకంపం వల్ల 5వేలమంది ప్రజలు 35 సహాయ శిబిరాల్లో తలదాచుకున్నారు.భూకంపం ప్రభావం వల్ల పలువురు తప్పిపోవడంతో వారికోసం సైనికులు,వాలంటీర్లు గాలిస్తున్నారు.పసమన్ బరాత్ జిల్లాకు ఈశాన్యంగా 17 కిలోమీటర్ల దూరంలో భూమి కింద 10 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది. 


Updated Date - 2022-02-26T14:00:37+05:30 IST