చైనాలో భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

ABN , First Publish Date - 2020-08-16T03:24:17+05:30 IST

చైనాలోని భారత రాయబార కార్యాలయంలో 74వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆ దేశంలోని భారత దౌత్యవేత్త విక్రం మిస్రీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని...

చైనాలో భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

బీజింగ్: చైనాలోని భారత రాయబార కార్యాలయంలో 74వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆ దేశంలోని భారత దౌత్యవేత్త విక్రం మిస్రీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం సభను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ‘మన దేశం ప్రస్తుతం రెండు సమస్యలతో పోరాడుతోంది. ఒకపక్క ప్రజలు కరోనాతో పోరాడుతుంటే.. మరో పక్క సరిహద్దు వద్ద ఉద్రిక్త పరిస్థితులపై దేశం అనుక్షణం అప్రమత్తంగా ఉండాల్సి వస్తోంది. ఈ రెండు సమస్యలూ దేశాన్ని కలవరపెడుతున్నాయి. దేశ స్వాతంత్ర్యం కోసం 74 ఏళ్ల క్రితం ఎలాంటి పోరాటం చేశామో.. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితులే మన దేశం ఎదుర్కొంటోంద’ని విక్రం పేర్కొన్నారు. అనంతరం ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.



Updated Date - 2020-08-16T03:24:17+05:30 IST