ఆయుధాల కోసం రష్యాతో భారత్ ఎమర్జెన్సీ డీల్
ABN , First Publish Date - 2021-08-28T21:17:31+05:30 IST
రష్యా నుంచి పెద్ద ఎత్తున ఆయుధాల కొనుగోలుకు
న్యూఢిల్లీ : రష్యా నుంచి పెద్ద ఎత్తున ఆయుధాల కొనుగోలుకు భారత వాయు సేన (ఐఏఎఫ్) ఒప్పందం కుదుర్చుకుంది. ప్రస్తుతం ఉన్న ఐఎన్ఎస్ఏఎస్ రైఫిల్స్కు బదులుగా ఏకే-103 అజాల్ట్ రైఫిల్స్ను సమకూర్చుకోబోతోంది. ఆఫ్ఘనిస్థాన్లో అమెరికా దళాలు వదిలేసిన ఆయుధాలు భారత దేశంలోని ఉగ్రవాద మూకలకు చేరే అవకాశం ఉన్న నేపథ్యంలో అత్యవసర నిబంధనల క్రింద ఐఏఎఫ్ ఈ ఒప్పందం కుదుర్చుకుంది.
ప్రభుత్వ వర్గాలు ఓ వార్తా సంస్థకు తెలిపిన వివరాల ప్రకారం, ఐఏఎఫ్కు 1.5 లక్షలకుపైగా అజాల్ట్ రైఫిల్స్ అవసరం. రూ.300 కోట్లతో దాదాపు 70 వేల ఏకే-103 అజాల్ట్ రైఫిల్స్ కొనుగోలుకు ఐఏఎఫ్ రష్యాతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ రైఫిల్స్ రానున్న మరికొద్ది నెలల్లో ఐఏఎఫ్కు చేరుకోవచ్చు. ఇవి అందుబాటులోకి వస్తే, ఉగ్రవాద చర్యలను మరింత సమర్థంగా తిప్పికొట్టడానికి వీలవుతుంది. వీటిని మొదట జమ్మూ-కశ్మీరు, శ్రీనగర్, కీలక వాయు సేన స్థావరాల్లోని దళాలకు అందజేస్తారు. ఈ ఒప్పందంపై సంతకాలు గత వారం జరిగినట్లు తెలుస్తోంది.
భారత సైన్యానికి దాదాపు 6.5 లక్షల రైఫిల్స్ అవసరం. ఏకే-103 కన్నా ఎక్కువ సామర్థ్యంగల ఏకే-203 రైఫిల్స్ కొనుగోలుకు రష్యాతో ఒప్పందానికి చర్చలు జరుగుతున్నట్లు తెలిసింది. గడచిన రెండేళ్ళ నుంచి భారత రక్షణ దళాల ఆయుధ వ్యవస్థల ఆధునికీకరణ వేగవంతమైంది. తూర్పు లడఖ్లో చైనా దుస్తంత్రం నేపథ్యంలో ఆయుధ వ్యవస్థల ఆధునికీకరణను భారత్ వేగవంతం చేసింది.