కుప్పకూలిన భారత వైమానిక దళ డ్రోన్

ABN , First Publish Date - 2022-04-05T01:25:13+05:30 IST

భారత వైమానిక దళానికి చెందిన డ్రోన్ (యూఏవీ) ఒకటి రాజస్థాన్‌లోని జైసల్మేర్..

కుప్పకూలిన భారత వైమానిక దళ డ్రోన్

జైపూర్: భారత వైమానిక దళానికి చెందిన డ్రోన్ (యూఏవీ) ఒకటి రాజస్థాన్‌లోని జైసల్మేర్ జిల్లాలో సోమవారంనాడు కుప్పకూలింది. ఈ విషయాన్ని అధికారులు ధ్రువీకరించారు. అయితే, దీనికి కారణం ఏమిటనేది వెంటనే నిర్ధారణ కాలేదు. దీనిపై దర్యాప్తు సాగిస్తున్నట్టు ఐఏఎఫ్ అధికారి ఒకరు తెలిపారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, జైసల్మేర్ సిటీలోని అమర్ షహీద్ సాగర్మల్ గోప కాలనీ సమీపంలో యూఏవీ కూలిపోయింది. నివాస ప్రాంతానికి సమీపంలో ప్రమాదం జరగడంతో ఈ ఘటనలో ఎవరైనా గాయపడ్డారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది.

Updated Date - 2022-04-05T01:25:13+05:30 IST