న్యూఢిల్లీ: ఇప్పటికిప్పుడు సార్వత్రిక ఎన్నికలు జరిగితే ఎన్డీయే తిరిగి అధికారంలోకి వస్తుందని ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో తేల్చి చెప్పింది. 543 స్థానాలున్న లోక్సభలో ఎన్డీయేకు 296, యూపిఏకు 127, ఇతరులకు 120 స్థానాలు దక్కుతాయని జోస్యం చెప్పింది. ఇందులో ఒక్క బీజేపీకే 271 స్థానాలు, కాంగ్రెస్కు 62, ఇతరులకు 210 స్థానాలు దక్కుతాయని వెల్లడించింది.