ఒకే రోజులో 3,116 కోవిడ్ కేసులు, 47 మరణాలు

ABN , First Publish Date - 2022-03-13T15:43:03+05:30 IST

దేశంలో గత 24 గంటల్లో 3,116 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. 47 మంది మృత్యువాత ..

ఒకే రోజులో 3,116 కోవిడ్ కేసులు, 47 మరణాలు

న్యూఢిల్లీ: దేశంలో గత 24 గంటల్లో 3,116 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. 47 మంది మృత్యువాత పడ్డారు. కేంద్రం ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం, గత 24 గంటల్లో 5,559 మంది కరోనా పేషెంట్లు డిశ్చార్జి అయ్యారు. మొత్తంగా రికవరీ రేటు 98.71 శాతంగా ఉంది. యాక్టివ్ కేసుల సంఖ్య 38,069కి తగ్గింది. దేశంలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 5,15,850కి చేరగా, తొలి కేసు 2020లో నమోదైంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ సమాచారం ప్రకారం, దేశంలో మార్చి 12వ తేదీ వరకూ 77,85,20,151 శాంపుల్స్ పరీక్షించగా, శనివారంనాడు 7,61,713 శాంపుల్స్ పరీక్షించారు. కాగా, ఢిల్లీలో శనివారంనాడు కొత్తగా 161 కోవిడ్ కేసులు నమోదు కాగా, ఒకరు మృతి చెందారు. పాజిటివిటీ రేటు 0.44గా ఉంది. మార్చి 5,6,7 తేదీల్లో సిటీలో ఒక్క కోవిడ్ మరణం కూడా నమోదు కాలేదు. జనవరి 13న కరోనా కేసుల సంఖ్య 28,867 కేసులకు చేరుకోగా, ఆ తర్వాత నుంచి రోజువారీ కేసులు తగ్గుతూ వస్తున్నాయి.

Updated Date - 2022-03-13T15:43:03+05:30 IST