కర్నాటకలో కరోనా వ్యాక్సిన్ తొలి ట్రయల్
ABN , First Publish Date - 2020-07-06T15:22:07+05:30 IST
భారతదేశపు మొదటి కరోనా టీకా కోవాక్సిన్కు కర్ణాటకలోని బెలగావిలో తొలి ట్రయల్ నిర్వహించనున్నారు. 200 మంది ఆరోగ్యకరమైన వాలంటీర్ల బృందంపై ఈ టీకా మొదటిసారిగా పరీక్షించనున్నారు.
బెంగళూరు: భారతదేశపు మొదటి కరోనా టీకా కోవాక్సిన్కు కర్ణాటకలోని బెలగావిలో తొలి ట్రయల్ నిర్వహించనున్నారు. 200 మంది ఆరోగ్యకరమైన వాలంటీర్ల బృందంపై ఈ టీకా మొదటిసారిగా పరీక్షించనున్నారు. వ్యాక్సిన్ తయారీదారు అయిన భారత్ బయోటెక్, ప్రముఖ వైద్యులు సంయుక్తంగా క్లినికల్ ట్రయల్స్ నిర్వహించనున్నారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) పర్యవేక్షణలో ఈ పరీక్షలు జరగనున్నాయి. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్ఐవి) సహకారంతో కోవిడ్ -19 నివారణకు భారతదేశపు మొదటి టీకాను విజయవంతంగా అభివృద్ధి చేసినట్లు హైదరాబాద్లోని బయోటెక్ కంపెనీ తెలిపింది.