భారత్‌లో కొత్తగా 42,618 కరోనా కేసులు నమోదు

ABN , First Publish Date - 2021-09-04T15:41:16+05:30 IST

దేశ వ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 42,618 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవగా...330 మంది మృతి చెందారు.

భారత్‌లో కొత్తగా 42,618 కరోనా కేసులు నమోదు

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 42,618 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవగా...330 మంది మృతి చెందారు. కరోనా నుంచి కోలుకుని 36,385 మంది డిశ్చార్జ్ అయ్యారు. దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,29,45,907కి చేరింది. అలాగే కోలుకున్న వారి సంఖ్య 3,21,00,001గా నమోదు అయ్యింది. ప్రస్తుతం 4,05,681 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు కరోనాతో మొత్తం 4,40,225 మంది మృతి చెందారు. 67,72,11,205 మంది టీకా తీసుకున్నారు. 

Updated Date - 2021-09-04T15:41:16+05:30 IST