స్వాతంత్య్ర వజ్రోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి

ABN , First Publish Date - 2022-08-07T05:07:21+05:30 IST

ఈనెల8నుంచి 22వరకు స్వాతంత్య్ర వజ్రోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర సీఎస్‌ సోమేష్‌ కుమార్‌ అన్నారు. శనివారం రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫెరెన్స్‌లో ఆయన మాట్లాడారు. జాతీయసమైక్యతను పెంపొందించేలా భారతస్వాతంత్య్రదినోత్సవాలను నిర్వహించాలని సూచించారు.

స్వాతంత్య్ర వజ్రోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి
వీడియో కాన్ఫెరెన్స్‌లో పాల్గొన్న జిల్లా కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌, తదితరులు

ఆసిఫాబాద్‌, ఆగస్టు 6: ఈనెల8నుంచి 22వరకు స్వాతంత్య్ర వజ్రోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర సీఎస్‌ సోమేష్‌ కుమార్‌ అన్నారు. శనివారం రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫెరెన్స్‌లో ఆయన మాట్లాడారు. జాతీయసమైక్యతను పెంపొందించేలా భారతస్వాతంత్య్రదినోత్సవాలను నిర్వహించాలని సూచించారు. ఆగస్టు8నుంచి 22వరకు నిర్వహించే వేడుకల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 563థియేటర్లలో పిల్లలకు గాంధీసినిమా ప్రదర్శితం చేయాలని తెలిపారు. ఇందుకు థియేటర్లు సిద్ధం చేయాలని సూచించారు. అలాగే సిటీకేబుల్‌ ఈనెల 12నుంచి దేశభక్తి పెంపొందించే కార్యక్రమాలు ప్రదర్శించేలా చూడాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌, అదనపు కలెక్టర్లు రాజేశం, చాహత్‌ బాజ్‌పాయ్‌ తదితరులు పాల్గొన్నారు.

స్వాతంత్య్ర దినోత్సవంపై ప్రదర్శనలు నిర్వహించాలి

ఆజాదికాఅమృత్‌ మహోత్సవంలో భాగంగాఈనెల15న స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులు, జానపద కళాకారులు అన్ని పాఠశాలలు, కళాశాలల్లో ప్రదర్శనలు నిర్వహించా లని కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల8 నుంచి 15వరకు కళాప్రదర్శనలు నిర్వహించాలన్నారు. 8,9,10,11,12తేదీల్లో ఎన్‌ఎస్‌ఎస్‌, ఎన్‌సీసీ ఉన్నవారు ప్రజలకు తెలిసేలా వివిధకార్యక్రమాలు నిర్వహించాలన్నారు.

Updated Date - 2022-08-07T05:07:21+05:30 IST