గాంధీ జయంతి నుంచి కార్మికుల నిరవధిక సమ్మె
ABN , First Publish Date - 2022-09-23T05:29:17+05:30 IST
దీర్ఘకాలికంగా పెం డింగ్లో ఉన్న తమ సమస్యల్ని అక్టోబర్ 1వ తేదీ నాటికి పరిష్కరించకుంటే ఆ మరుసటి రోజైన గాంధీ జయంతి నుంచి నిరవధిక సమ్మెలోకి వెళతామని ఏపీ గ్రామ పంచాయ తీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ అసోసియేష న్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటరామయ్య తెలిపారు.
పీలేరు, సెప్టెంబరు 22: దీర్ఘకాలికంగా పెం డింగ్లో ఉన్న తమ సమస్యల్ని అక్టోబర్ 1వ తేదీ నాటికి పరిష్కరించకుంటే ఆ మరుసటి రోజైన గాంధీ జయంతి నుంచి నిరవధిక సమ్మెలోకి వెళతామని ఏపీ గ్రామ పంచాయ తీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ అసోసియేష న్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటరామయ్య తెలిపారు. ఈ మేరకు ఆయన తోటి కార్మికులతో కలిసి గురువారం పీలేరు సర్పంచ్ డాక్టర్ హబీబ్ బాషా, కార్యదర్శి రెడ్డిప్రసాద్కు సమ్మె నోటీసు అందేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులకు ప్రభుత్వం ఇస్తున్న అరకొర వేతనాలు కూడా చాలా చోట్ల రెండు నెలల నుంచి 36 నెలల వరకు బకాయిలు ఉన్నాయన్నారు. కార్యక్రమంలో కార్మిక నాయకులు నాగార్జున, పులి రెడ్డప్ప, తదితరులు పాల్గొన్నారు. ===========================================================================================