మంత్రాలయంలో పెరిగిన రద్దీ

ABN , First Publish Date - 2022-01-24T05:56:40+05:30 IST

రాఘవేంద్ర స్వామి దర్శనార్థం వచ్చిన భక్తులతో మంత్రాలయం కోలాహలంగా మారింది.

మంత్రాలయంలో పెరిగిన రద్దీ
మహా ముఖద్వారం ముందు భక్తుల రద్దీ

మంత్రాలయం, జనవరి 23: రాఘవేంద్ర స్వామి దర్శనార్థం వచ్చిన భక్తులతో మంత్రాలయం కోలాహలంగా మారింది. ఆదివారం సెలవు దినం కావడంతో.. కర్ణాటకలో శని, ఆదివారం వారాంతపు లాక్‌డౌన్‌ను ఎత్తేయడం వల్ల వేలాది సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. తుంగభద్ర నదిలో పుణ్యస్నానాలు ఆచరించి గ్రామ దేవత మంచాలమ్మను దర్శించుకుని, రాఘవేంద్ర స్వామి బృందావనానికి మొక్కులు తీర్చుకు న్నారు. రథోత్సవాల్లో పాల్గొని పీఠాధిపతి సుభుదేంద్రతీర్థుల ఆశీస్సులు పొందారు. ప్రధాన రహదారులు, మఠం ప్రాంగణం, మహాముఖద్వారం, నదీతీరం, రాఘవేంద్ర సర్కిళ్లు భక్తుల రద్దీగా మారాయి. 

Updated Date - 2022-01-24T05:56:40+05:30 IST