బీడీ కార్మికులకు పని దినాలు పెంచండి
ABN , First Publish Date - 2021-01-20T06:41:34+05:30 IST
మండలంలోని వివిధ బీడీ కార్ఖానాలలో పని చేస్తున్న బీడీ కార్మికులకు నెలలో కనీసం 22 రోజులు పని దినాలు కల్పించాలని బీడీ కార్మికులు డిమాండ్ చేశారు.
బోథ్, జనవరి19: మండలంలోని వివిధ బీడీ కార్ఖానాలలో పని చేస్తున్న బీడీ కార్మికులకు నెలలో కనీసం 22 రోజులు పని దినాలు కల్పించాలని బీడీ కార్మికులు డిమాండ్ చేశారు. మంగళవారం బోథ్ తహసీల్దార్ కార్యాలయం వద్ద బీడీ కార్మిక సంఘం నాయకులతో కలిసి బీడీ కార్మికులు ధర్నా చేశారు. జిల్లా అధ్యక్షుడు గోవర్ధన్ మాట్లాడుతూ కరోనా వల్ల గతం లో పది రోజుల పనిదినాలు కల్పించారని, అధికారులు ఈ విషయంలో జోక్యం కల్పించుకోవాలని కోరారు. ఇందులో కె.గోదావరి, తదితరులున్నారు.