క్రీడలతో ఐకమత్యం పెంపు
ABN , First Publish Date - 2022-05-23T07:09:54+05:30 IST
క్రీడలతో యువతలో ఐకమత్యం పెంపొందుతుందని టీడీపీ మండల అధ్యక్షుడు మీగడ ఓబుల్రెడ్డి అ న్నారు.
క్రికెట్ పోటీల ప్రారంభంలో ఓబుల్రెడ్డి
పొదిలి, మే 22: క్రీడలతో యువతలో ఐకమత్యం పెంపొందుతుందని టీడీపీ మండల అధ్యక్షుడు మీగడ ఓబుల్రెడ్డి అ న్నారు. ఆదివారం పొదిలి జూనియర్ కళాశాల ఆవరణలో సైకోలెవన్స్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి మెగా క్రికెట్ టోర్నమెంట్ పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడాకారులు క్రీడాస్పూర్తి అలవర్చుకోవాలన్నారు. గెలుపు, ఓటములను సమానంగా తీసుకొని పోటీలను కొనసాగిం చాలన్నారు. స్నేహపూరిత వాతా వరణంలో క్రికెట్ పోటీలు జరగాలని ఆకాంక్షించారు. అనంతరం టాస్ వేసి ఆట ప్రారంభించారు. ఈ పోటీలకు ప్రకాశం, నెల్లూరు, గుంటూరు తదితర జిల్లాల నుంచి 40 టీముల వచ్చాయి. మొదటిగా తుమ్మెలపాడు, బొట్లపాలెం మధ్య పోటీ ప్రారంభమైంది. మొదటి బహుమతి రూ.50,116, రెండవ బహుమతి రూ.30,116, మూడవ బహుమతి రూ.20,116లు అందజేయనున్నారు. కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు ముల్లాఖుద్దూస్, ఠాగూర్, కృష్ణారెడ్డి, నాయుడు, జి.చౌడేశ్వరరావు, ప్రతాప్ పాల్గొన్నారు.