యూకేలో డెడ్లియెస్ట్ డే.. 786 మంది మృతి

ABN , First Publish Date - 2020-04-08T03:31:06+05:30 IST

బ్రిటన్‌లో కరోనా మరణాలు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో ఏకంగా 786 మంది

యూకేలో డెడ్లియెస్ట్ డే.. 786 మంది మృతి

లండన్: బ్రిటన్‌లో కరోనా మరణాలు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో ఏకంగా 786 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే, 55,242 కరోనా కేసులు నమోదయ్యాయి. మరణించిన వారి సంఖ్య 6,159కి పెరిగినట్టు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ట్వీట్ చేసింది. ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ కరోనా మహమ్మారి బారినపడి ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన లండన్ ఆసుపత్రిలోని ఇంటెన్సివ్‌ కేర్ వార్డులో చికిత్స పొందుతున్నారు. ఇప్పుడు ఆయన పరోక్షంలో విదేశాంగ మంత్రి డొమినిక్ రాబ్ వ్యవహారాలను చూస్తున్నారు. కాగా, సీనియర్ మంత్రి మైఖేల్ గోవ్‌లోనూ కరోనా లక్షణాలు కనిపించాయి. దీంతో ఆయన స్వీయ ఐసోలేషన్‌లో ఉన్నారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు.  

Updated Date - 2020-04-08T03:31:06+05:30 IST