రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
ABN , First Publish Date - 2021-01-27T04:55:43+05:30 IST
మండలంలో దాచూరు- పెరంకొండ మధ్యలో మంగళవారం ఆర్టీసీ బస్సు మోటారు సైకిల్ను ఢీకొన్న ప్రమాదంలో ఒక యువకుడు మృతిచెందాడు.
కలువాయి, జనవరి 22 : మండలంలో దాచూరు- పెరంకొండ మధ్యలో మంగళవారం ఆర్టీసీ బస్సు మోటారు సైకిల్ను ఢీకొన్న ప్రమాదంలో ఒక యువకుడు మృతిచెందాడు. వివరాలిలా ఉన్నాయి. పెరంకొండ గ్రామానికి చెందిన సుంకు ప్రవీణ్కుమార్ (19) మోటారు సైకిల్పై ఆదూరుపల్లికి వచ్చి పురుగుమందులు తీసుకుని స్వగ్రామానికి బయలుదేరాడు. దాచూరు- పెరంకొండ మధ్యలో రోడ్డు మలుపు వద్ద పెంచలకోన నుంచి నెల్లూరు వెళుత్తున్న ఆర్టీసీ బస్సు మోటారు సైకిల్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో ప్రవీణ్కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రవీణ్కుమార్ డిగ్రీ చదువుతున్నాడు. ఈ సంఘటనపై పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.