Karnatakaలో ఒక్కరోజులోనే రెట్టింపు కొవిడ్ కేసులు

ABN , First Publish Date - 2022-01-19T13:11:47+05:30 IST

కర్ణాటక రాష్ట్రంలో ఒక్కరోజులోనే రెట్టింపు కొవిడ్ కేసులు నమోదు కావడం సంచలనం రేపింది...

Karnatakaలో ఒక్కరోజులోనే రెట్టింపు కొవిడ్ కేసులు

బెంగళూరు: కర్ణాటక రాష్ట్రంలో ఒక్కరోజులోనే రెట్టింపు కొవిడ్ కేసులు నమోదు కావడం సంచలనం రేపింది. కర్ణాటకలో మంగళవారం ఒక్కరోజే 41,457 కరోనా కేసులు వెలుగుచూశాయి. కొవిడ్ వల్ల 20 మంది రోగులు మరణించారు.సోమవారం కర్ణాటకలో 27,156 కరోనా కేసులు నమోదు కాగా మంగళవారం నాటికి వీటి సంఖ్య 41,457కు పెరిగాయి. కర్ణాటకలో కొవిడ్ పాజిటివిటీ రేటు 22.3శాతానికి పెరిగింది. కర్ణాటకలో 2,50,381 యాక్టివ్ కరోనా కేసులున్నాయని ఆరోగ్యశాఖ అధికారులు చెప్పారు.కరోనా వల్ల కర్ణాటకలో మరణాల సంఖ్య 38,445కు పెరిగాయి.బెంగళూరు నగరంలోనూ కరోనా కేసులు రికార్డు స్థాయిలో పెరిగాయి. ఏ రోజుకారోజు పెరుగుతున్న కరోనా కేసులతో కర్ణాటకలో ప్రజలు కలవర పడుతున్నారు. కొవిడ్ కట్టడికి ఆరోగ్యశాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 


Updated Date - 2022-01-19T13:11:47+05:30 IST