5 రోజుల్లో రెట్టింపైన కరోనా కేసులు..

ABN , First Publish Date - 2020-04-03T23:00:55+05:30 IST

కేంద్రం కోవిడ్-19పై పోరాటానికి రక్షణాత్మక చర్యలు ప్రకటిస్తున్నా, రాష్ట్రాలు ప్రత్యేక సూచనలతో ముందుకు వెళ్తున్నా కరోనా విస్తరణ కేసులు ఇండియాలో రోజురోజుకూ..

5 రోజుల్లో రెట్టింపైన కరోనా కేసులు..

న్యూఢిల్లీ: కేంద్రం కోవిడ్-19పై పోరాటానికి రక్షణాత్మక చర్యలు ప్రకటిస్తున్నా, రాష్ట్రాలు ప్రత్యేక సూచనలతో ముందుకు వెళ్తున్నా కరోనా విస్తరణ కేసులు ఇండియాలో రోజురోజుకూ పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇంకా కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ దశకు రాలేదని కేంద్రం ప్రకటిస్తున్నా, కొత్త కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి.


కొద్ది రోజుల గణాంకాలను పరిశీలిస్తే, మార్చి 10 నుంచి 20 వరకూ కోవిడ్-19 పాజిటివ్ కేసులు 50 నుంచి 196కి చేరుకున్నారు. మార్చి 25 నాటికి కేసుల సంఖ్య 606కు చేరుగా, మార్చి 31 నాటికి 1397 కేసులు నమోదయ్యాయి. నిజానికి ఐదు రోజులనేది చాలా సుదీర్ఘ సమయం ఏమీ కానప్పటికీ, అదే ఐదు రోజుల్లో కోవిడ్-19 నమోదు కేసులు ఇబ్బడిముబ్బడిగా పెరగడం ఒకింత ఆందోళన కలిగించే విషయమని గణాంకాలు చెబుతున్నాయి. మార్చి 29 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకూ కోవిడ్-19 కేసులు 1,024 నుంచి 2,069కి చేరుకున్నాయి. అంటే ఐదు రోజుల్లో రెట్టింపుకు పైగా కేసులు నమోదైనట్టు లెక్క. కాగా, రాబోయే ఐదు రోజులు మరింత కీలకమని నిపుణులు చెబుతున్నారు.

Updated Date - 2020-04-03T23:00:55+05:30 IST