ఆకట్టుకున్న కవి సమ్మేళనం
ABN , First Publish Date - 2022-08-18T06:05:15+05:30 IST
భారత వజ్రోత్సవా ల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో నిర్వహించిన కవి సమ్మేళనం ఆకట్టుకుంది.
- 85 మంది కవులను సత్కరించిన కలెక్టర్
జగిత్యాల టౌన్, ఆగస్టు 17: భారత వజ్రోత్సవా ల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో నిర్వహించిన కవి సమ్మేళనం ఆకట్టుకుంది. దేశభక్తి గీతాలతో జానపద కళాకారుల ప్రదర్శనలు అలరింపజేశాయి. కవి సమ్మేళనం కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన తెలుగు, ఉర్ధూ కవులు తమ కవితల ద్వారా దేశ గొప్పతనాన్ని చాటి చెప్పారు. కవి సమ్మేళనానికి కలెక్టర్ రవి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కవి సమ్మేళ నంలో పాల్గొన్న 85 మంది కవులను సత్కరించి ప్రశంసాపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బీఎస్ లత, కోరుట్ల ఆర్డీవో వినోద్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ లక్ష్మీనారాయణ, జిల్లా పౌరసంబంధాల అధికారి సుధీర్, ఎస్సీ, బీసీ వెల్ఫేర్ అధికారులు రాజ్కుమార్, సాయిబాబా, జిల్లా అటవీశాఖ అధికారి వెంకటేశ్వర్రావు తదితరులు ఉన్నారు.