దూరదృష్టితో పథకాల అమలు

ABN , First Publish Date - 2022-08-20T05:37:52+05:30 IST

దూరదృష్టితో పథకాల అమలు

దూరదృష్టితో పథకాల అమలు
చెక్కులను పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే ప్రకా్‌షగౌడ్‌

శంషాబాద్‌, ఆగస్టు 19: సీఎం కేసీఆర్‌ దూరదృష్టితో పథకాలను అమలు చేస్తున్నారని ఎమ్మెల్యే ప్రకా్‌షగౌడ్‌ అన్నారు. మున్సిపాలిటీ పరిధిలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకం ద్వారా పలువురు లబ్ధిదారులకు మంజూరైన చెక్కులను ఎమ్మెల్యే శుక్రవారం స్థానిక బేగంమ్స్‌ ఫంక్షన్‌హాల్‌లో పంపిణీ చేశారు. ఆయన వెంట మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సుష్మారెడ్డి, ఎంపీపీ జయమ్మశ్రీనివాస్‌ ఉన్నారు. కార్యక్రమంలో చైర్‌పర్సన్‌ సుష్మారెడ్డి, వెస్‌చైర్మ్‌న్‌ బండిగోపాల్‌యదవ్‌ కౌన్సిలర్‌ ప్రవీణ్‌గౌడ్‌, ఎంపీపీ జయమ్మశ్రీనివాస్‌, వైస్‌ఎంపీపీ లీలామోహన్‌నాయక్‌, జడ్పీటీసీ నీరటి తన్వీరాజు పాల్గొన్నారు. కాగా కార్యక్రమంలో ప్రొటోకాల్‌ పాటించడంలేదని కౌన్సిలర్‌ కొండా ప్రవీణ్‌గౌడ్‌ ధ్వజమెత్తారు. చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని పార్టీ కార్యకర్తల కార్యక్రమంగా చేస్తున్నారని ఆరోపించారు. అధికారులు స్పందించకుంటే కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తానన్నారు. శంషాబాద్‌ మున్సిపాలిటీకి కొత్తగా కేటాయించిన వైకుంఠరథాన్ని శుక్రవారం ఎమ్మెల్యే ప్రకా్‌షగౌడ్‌ ప్రారంభించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సుష్మా వైస్‌చైర్మన్‌ బండిగోపాల్‌యాదవ్‌తో పాటు పలువురు కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-20T05:37:52+05:30 IST