వైభవంగా దుర్గాదేవి నిమజ్జనం
ABN , First Publish Date - 2022-10-07T05:11:01+05:30 IST
మండల కేంద్రంలో పది రోజులుగా పూ జలందుకున్న అమ్మ వారిని గురువారం వైభవంగా నిమజ్జనం చేశారు.
బత్తలపల్లి, అక్టోబరు 6: మండల కేంద్రంలో పది రోజులుగా పూ జలందుకున్న అమ్మ వారిని గురువారం వైభవంగా నిమజ్జనం చేశారు. బత్తలపల్లిలో దేవినవరాత్రుల సం దర్భంగా దుర్గాదే వి విగ్రహాన్ని ప్రతిష్ఠిం చారు. పది రోజులుగా వివిధ రూపాల్లో భక్తులకు దర్శనవమిచ్చారు. గురు వారం పురవీధుల గుండా అమ్మవారిని ఊరేగింపుగా తీసుకెళ్లి నిమజనం చేశా రు. యువకులు రంగులు చల్లుకుంటూ నృత్యాలు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామపెద్దలు జక్కంపూటి పురుషోత్తంచౌదరి, రంగానాయుడు, బాస్కర్, అజయ్, వినయ్, రాజు, బొజ్జప్ప తదితరులు పాల్గొన్నారు.
్లనల్లమాడ: శరన్నవరాత్రుల్లో భాగంగా టీడీపీ పట్టణాధ్యక్షుడు మైలే రామ చంద్ర నివాసం వద్ద దుర్గాదేవిని ప్రతిష్ఠించి, తొమిది రోజులు ప్రత్యేక పూజలు చేశారు. బుధవారం పురవీధుల్లో ఊరేగించారు. మాజీమంత్రి పల్లె రఘునాథ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఊ రేగింపులో పాల్గొన్నారు. సమీప కుంటలో అమ్మవారిని నిమజ్జనం చేశారు. ఈకార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్ మైలే శివశంకర్, మైలే హరి, మైలే రామచంద్ర, మైలే మల్లికార్జున, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.